29-06-2025 02:13:47 AM
దర్యాప్తు చేస్తున్న ఈవోడబ్ల్యూ
ముంబై, జూన్ 28: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన ఓ ఎంపీ కారు డ్రైవర్కు నిజాం దివాన్ వారసు లు రూ.150 కోట్ల విలువైన మూడెకరాల భూమిని బహుమతిగా ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ లంచం గురించి ఓ న్యా యవాది ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించా రు.
షిండే వర్గానికి చెందిన ఎంపీ సందీపన్ భుమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలా స్ వద్ద రసూల్ షేక్ అనే వ్యక్తి డ్రైవర్గా పని చేస్తున్నారు. ఆ డ్రైవర్కు చత్రపతి శంభాజీనగర్లో నివాసం ఉంటున్న నిజాం దివాన్ వారసులు రూ. 150 కోట్ల విలువైన మూడెకరాల భూమిని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. ఈ వ్యవహారంపై ముజాహిదిన్ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా ఆర్థిక నేరాల విభాగం అధికారులు (ఈవోడబ్ల్యూ) దర్యాప్తు ప్రారంభించారు.
రసూల్ షేక్ సదరు ఎంపీ దగ్గర 13 ఏండ్లుగా డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డ్రైవర్కు గిఫ్ట్గా ఇ చ్చిన భూమిపై దివాన్ వారసులు ఎన్నో ఏ ండ్లపాటు న్యాయపోరాటం చేసి 2022లో దక్కించుకున్నారని,
అటువంటి భూమిని ఎ టువంటి రక్తసం బంధం లేని వ్యక్తికి ఎలా ఇ స్తారని ముజాహిదీన్ఖాన్ ఫిర్యాదులో ప్ర శ్నించారు. దివాన్ వారసులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే భూమిని గిఫ్ట్డీ డ్ చే శారని డ్రైవర్ తెలిపినట్టు సమాచారం. పోలీసులు ఈ విషయంపై తనను కూడా సం ప్రదించారని ఎమ్మెల్యే విలాస్ తెలిపారు.