17 April, 2026 | 10:31 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఎంపీ కారు డ్రైవర్‌కు 150 కోట్ల బహుమతి

29-06-2025 02:13 AM
  1. శిండే సేన వర్గానికి చెందిన ఎంపీ సందీపన్ డ్రైవర్‌కు మూడెకరాల గిఫ్ట్

దర్యాప్తు చేస్తున్న ఈవోడబ్ల్యూ

ముంబై, జూన్ 28: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఓ ఎంపీ కారు డ్రైవర్‌కు నిజాం దివాన్ వారసు లు రూ.150 కోట్ల విలువైన మూడెకరాల భూమిని బహుమతిగా ఇవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ లంచం గురించి ఓ న్యా యవాది ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించా రు.

షిండే వర్గానికి చెందిన ఎంపీ సందీపన్ భుమ్రే, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విలా స్ వద్ద రసూల్ షేక్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఆ డ్రైవర్‌కు చత్రపతి శంభాజీనగర్‌లో నివాసం ఉంటున్న నిజాం దివాన్ వారసులు రూ. 150 కోట్ల విలువైన మూడెకరాల భూమిని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. ఈ వ్యవహారంపై ముజాహిదిన్ ఖాన్ అనే న్యాయవాది ఫిర్యాదు ఆధారంగా ఆర్థిక నేరాల విభాగం అధికారులు (ఈవోడబ్ల్యూ) దర్యాప్తు ప్రారంభించారు.

రసూల్ షేక్ సదరు ఎంపీ దగ్గర 13 ఏండ్లుగా డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. డ్రైవర్‌కు గిఫ్ట్‌గా ఇ చ్చిన భూమిపై దివాన్ వారసులు ఎన్నో ఏ ండ్లపాటు న్యాయపోరాటం చేసి 2022లో దక్కించుకున్నారని,

అటువంటి భూమిని ఎ టువంటి రక్తసం బంధం లేని వ్యక్తికి ఎలా ఇ స్తారని ముజాహిదీన్‌ఖాన్ ఫిర్యాదులో ప్ర శ్నించారు. దివాన్ వారసులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే భూమిని గిఫ్ట్‌డీ డ్ చే శారని డ్రైవర్ తెలిపినట్టు సమాచారం. పోలీసులు ఈ విషయంపై తనను కూడా సం ప్రదించారని ఎమ్మెల్యే విలాస్ తెలిపారు.