29-06-2025 02:15:23 AM
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్
న్యూఢిల్లీ, జూన్ 28: భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి ‘లౌకిక’, ‘సోషలిస్ట్’ పదాలను తొలగించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా భారత ఉప రాష్ట్రప తి జగదీప్ ధన్ఖర్ కూడా ఆ పదాలను రా జ్యాంగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన జగదీప్ ధన్ ఖర్ మాట్లాడుతూ.. ఎమర్జెన్సీ సమయం లో 42వ రాజ్యాంగ సవరణ కింద ఈ పదాలను చేర్చడాన్ని ‘న్యాయానికి అపహస్యం గా’.. ‘సనాతన స్ఫూర్తికి అపచారంగా’ ఆయ న అభివర్ణించారు.
రాజ్యాంగ ప్రవేశికను మార్చలేమని.. అది రాజ్యాంగ వృద్ధికి కీలక ఆధారమని వెల్లడించారు. రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ లాంటిదని పే ర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్టు తెలిపా రు. అయితే రాజ్యాంగ ప్రవేశిక నుం చి ‘సోషలిస్ట్’, లౌకిక పదాలను తొలగించాలంటూ దత్తాత్రేయ వ్యా ఖ్యల పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడిన సంగ తి తెలిసిందే.