వేదాంత నుంచి 4వ మధ్యంతర డివిడెండ్
16-12-2024 12:13 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 15: వరుస డివిడెండు చెల్లింపులతో షేర్హోల్డర్లకు లాభాల్ని పంచుతున్న మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ప్రస్తుత 2024 ఆర్థిక సంవత్సరం లో నాల్గవ మధ్యంతర డివిడెండ్ను ఈ సోమవారం, డిసెంబర్ 26న ప్రకటించనుంది. 4వ డివిడెండును ఆమోదించేందు కు డిసెంబర్ 16న తమ డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతుందని వేదాంత స్టాక్ ఎక్సేంజీల కు తెలిపింది. ఈ డివిడెండు స్వీకరణకు అర్హమైన షేర్హోల్డర్లను నిర్ధారించడానికి డిసెంబర్ 24 రికార్డుతేదీగా నిర్ణయించినట్లు వేదాంత వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.35 విలువైన మూడు మధ్యంతర డివిడెండ్లను కంపెనీ చెల్లించింది. శుక్రవారం వేదాంత షేరు రూ.519.70 వద్ద ముగిసింది.




