3 July, 2026 | 11:35 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి

03-07-2026 09:44 PM

భాజపా ఆధ్వర్యంలో ఏవోకి వినతి పత్రం

నేరేడుచర్ల,(విజయక్రాంతి): డీఏపీ అసలు ధర సుమారు రూ.3000 ఉండగా కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో 1350 రూపాయలకు అందించడం జరుగుతుందని, కానీ ఎరువుల షాపుల వద్ద రైతులకు ఎమ్మార్పి కంటే 300  నుండి 400 ధరకు ఎక్కువగా విక్రయిస్తున్నారని,భాజాపా నేరేడుచర్ల పట్టణ అధ్యక్షులు కొనతం నాగిరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారి జావీద్ కు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... డీఏపీ, 20-20-0-13, ఇతర ఎరువుల బస్తాపై ఉన్న ధరకు అమ్మకుండా, ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా  రైతుల నెత్తిన భారాన్ని మోపడం జరుగుతుందని, ఎరువుల షాపులను తనిఖీ చేసి ఎమ్మార్పి ధరకు అమ్మే  విధంగా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమoలో జిల్లా భాజపా కోశాధికారి తాళ్ల నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు సంకల మద్ది సత్యనారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏమి రెడ్డి శంకర్ రెడ్డి, కొప్పుల లక్ష్మీనారాయణ, జూలూరి అశోక్, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, బుస్సా విమల తదితరులు పాల్గొన్నారు.