26 June, 2026 | 6:47 PM

Breaking News

ఐకేపీ వీఓఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలి   •   టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా ఆరెపల్లి రాహుల్   •   నిర్మల్ పోలీస్... మీ పోలీస్...   •   బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా రాపాక ప్రవీణ్ నియామకం   •   డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •  

గురునానక్ కాలేజీలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

02-01-2026 01:30 AM
  1. మృతుడు ఫస్టియర్ చదువుతున్న రాము

గత ఏడాది మే నెలలోనూ ఇదే కాలేజీలో విద్యార్థిని బలవన్మరణం

వరుస ఘటనలతో క్యాంపస్‌లో కలకలం

విద్యార్థుల్లో ఆందోళన

హైదరాబాద్, సిటీబ్యూరో జనవరి 1 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం వచ్చిన ఓ విద్యార్థి అర్థాంతరంగా తనువు చాలించాడు. గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ హాస్టల్ గదిలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాము 20 ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గురువారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగుచూడటం తో తోటి విద్యార్థులు భయాందోళనకు గుర య్యారు. వివరాల్లోకి వెళితే.. రాము బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నాడు. గురువారం మధ్యాహ్నం తన గదిలో ఎవరూ లేని సమయంలో రాము ఉరేసుకుని కనిపించాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే కాలేజీ యాజమాన్యానికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.