16-12-2025 12:34:02 AM
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వనపర్తి, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : పక్షపాతం ఉన్నాడో ప్రజా నాయకుడు కాలేడని ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానిస్తే.ప్రజలే అంతు చూస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం మూడో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అడ్డాకల్ మండలం బలీదుపల్లి, కమ్మనూర్, చిన్న మునుగాల్ చెడు, పెద్ద మునగాల్ చెడు, పొన్నకల్ గ్రామాల అభ్యర్థులు వేణు యాదవ్, మునగాల లక్ష్మీ, పాలెం.శ్రీనివాసులు,ఎం.వెంకటేష్ , మహమూద్ ల తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అధికారం చేజిక్కించుకోవడానికి భూమి,ఆకాశం తెచ్చి మీ ముందు పెడతాం అని మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను నానాగోస పెడుతున్నారని విమర్శించారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ అభివృద్ధి కుంటుపడిందని రైతులకు సాగు తాగు నీరు, కరెంట్,ధాన్యానికి బోనస్ లేక రైతులు అప్పుల పాలయినారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్.పి.టి.సి లు రఘుపతి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎం.పి.పి దయాకర్,నాయకులు దామోదర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,పట్టణ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ , నాయకులు తదితరులు పాల్గొన్నారు.