23 June, 2026 | 7:19 PM

Breaking News

విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •   ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య... నాణ్యమైన భోజనం   •  

పటిష్ట ఏర్పాట్లు చేయాలి

16-12-2025 12:35 AM
  1. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,డిసెంబర్15(విజయక్రాంతి):3వ దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పొరపాట్లకు తావు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని, ఎన్నికల విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఆదేశించారు.

సోమవారం వెంకటాపురం, వాజేడు,ఎంపీడీవో కార్యాలయాల్లో, కన్నాయిగూడెం రైతు వేదికలో వేరు వేరుగా మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మండల ప్రత్యేక అధికారి, తహసిల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, జోనల్ ఆఫీసర్స్,ఆర్వోలు,మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంలలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను పకడ్బందీగా, పారదర్శకంగా, నిబంధనలు పాటిస్తూ ఎన్నికల విధులు నిర్వహించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు.అధికారుల ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమయానికి పూర్తి చేసి, పోలింగ్ డే రోజున ఎలాంటి లోపాలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని  ఆదేశించారు.