03-06-2025 09:08:48 PM
కోదాడ: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి కోదాడ స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సత్యనారాయణ ముందు మంగళవారం హాజరు పరచగా నలుగురికి జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా మరొక వ్యక్తికి రూ.2వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోదాడ పట్టణ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం... డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా పట్టుపడ్డారు. పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తుల మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి ₹2,000 జరిమానాలతో పాటు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
అదేవిధంగా కోదాడ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ పట్టణంలోని స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు మద్యం చేయించి వాహనాలు నడుపుతున్న క్రమంలో వారిని పట్టుకొని కోర్టులో హాజరపరచగా ఇద్దరికీ రూ. 2 వేల జరిమానాలతో పాటు ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు మరొక వ్యక్తికి రూ. 2 వేల జరిమానా విధించినట్టు తెలియజేశారు.