calender_icon.png 17 June, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట

17-06-2025 12:08:02 AM

-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

-అదనపు తరగతి గదుల నిర్మాణానికి న్యూలాండ్ పరిశ్రమ సహకారం

-ఎమ్మెల్సీ సీ అంజిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే 

పటాన్ చెరు, జూన్ 16 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతో పాటు స్థానిక పరిశ్రమల సహకారంతో ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నామని తెలిపారు. 

సోమవారం జిన్నారం మండలం శివనగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో న్యూ ల్యాండ్ పరిశ్రమ సీఎస్‌ఆర్ నిధులు రూ. 50 లక్షలతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు సోమవారం ఎమ్మెల్సీ సీ అంజిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో  ఎమ్మెల్యే మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.  పటాన్ చెరు నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల, నవోదయ పాఠశాలలు త్వరలోనే ఏర్పాటు కానున్నాయని చెప్పారు. శివనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరో రెండు అదనపు అంతస్తుల నిర్మాణానికి న్యూ ల్యాండ్ పరిశ్రమ కోటి రూపాయలు అందించేందుకు అంగీకరించిందని తెలిపారు.

ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ పటాన్ చెరు నియోజకవర్గంలో బాలికల కోసం నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. మాజీ జెడ్పీటీసీ కె.ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలో సీసీ రోడ్డు,  నిలిచిపోయిన కమ్యూనిటీ భవన నిర్మాణ పనులను పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో  న్యూ ల్యాండ్ పరిశ్రమ ప్రతినిధులు డి.వి.రెడ్డి, హెచ్ ఆర్ మేనేజర్ రవి, యాదగిరి, మధుబాబు, హెచ్‌ఎం సధ్యారాణి, మాజీ సర్పంచ్ లు పూజారి రాజు, చిట్ల సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ ఆకుల భార్గవ్,  నాయకులు బేల క్రిష్ణ, బత్తుల మహేశ్, ఆకుల నవీన్కుమార్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.