17-06-2025 12:06:33 AM
దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
ముసాపేట జూన్ 16 : ఆరోగ్యం బాగాలేదని అధర్యపడకూడదని ప్రతి ఒక్కరు ధైర్యంగా జీవించేందుకు అ డుగులు వేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూ దన్ రెడ్డి అన్నారు. ముసాపేట మండలం జానంపేట గ్రామంలో రైతు వేదికలో జరిగిన రైతు నేస్తాం వీడియో కాన్ఫరెన్స్ లో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండలం లోనీ వివిధ గ్రామాల ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అం దజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని, పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలోతాసిల్దార్ రాజు నాయక్, అగ్రికల్చర్ ఏవో అనీల్ కుమార్, ఎంపీడీవో కృష్ణయ్య, ఎంపీ ఓ అనురాధ, ఏఈ ఓ సురేష్, బోయ రవి కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.