20 March, 2026 | 4:31 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సంచిలో నాటు బాంబు.. కుక్క కొరకడంతో పేలుడు

03-12-2025 03:13 PM

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాట బాంబు కలకలం రేపింది. కొత్తగూడెం రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని దుండగులు ఓ నల్ల సంచిలో బాంబు అమర్చి వెళ్లారు. అటుగా వెళ్లిన ఓ కుక్క తిన్నే పదార్థం అనుకోని కొరకడంతో బాంబు పేలింది. ఈ ఘటనలో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే స్టేషన్ లో ఒక్కసారిగా బాంబు పేలి భారీగా శబ్ధం రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అప్రమత్తమై రైల్వే స్టేషన్ పరిసరాల్లో డాగ్స్ స్క్వాడ్ తో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ నాటు బాంబు అమర్చడం వెనుక ఎదైన కుట్ర దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.