16 March, 2026 | 11:24 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

ఏసీబీ వలలో అవినీతి అధికారులు

08-01-2026 01:35 AM

రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నందిగామ ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి 

షాద్‌నగర్, జనవరి 7 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా నందిగామ ఎంపీడీవో సుమతి, ఎంపీఓ తేజ్‌సింగ్, ఈదులపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య బుధవారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధి కారులు పట్టుకున్నారు. నందిగామ మండలం ఈదులపల్లి గ్రామ వ్యవసాయ క్షత్రంలో భవన నిర్మాణ అను మతి కోసం ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా గ్రామపంచాయతీ కార్యదర్శి చెన్నయ్య, ఎంపీఓ తేజ్ సింగ్, ఎంపీ డీవో సుమతి రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.

బాధితుడు రెండున్నర లక్షలకు డీల్ కుదుర్చుకోగా ముందే లక్ష యాభై వేలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. మిగతా లక్ష రూపాయలు బుధవారం నందిగామ ఎంపీడీవో కార్యాలయంలోనే లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.