నిఖత్ జరీన్, లవ్లీనాలకు బై
ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్
మంగోలియా, మార్చి 29 : ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ పోరా టం సోమవారం నుంచి మొదలుకాబోతోం ది. 20 మందితో కూడిన భారత బాక్సింగ్ జట్టుపై భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ పోటీలకు సంబంధించిన డ్రా వివరాల ను ప్రకటించారు. తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్,మరో స్టార్ బాక్సర్ లవ్లీనాలకు తొలి మ్యాచ్లలో బై లభించింది. వీరిద్దరితో పాటు జాస్మిన్, అంకుషిత, అరుంధతి చౌద రి, ఆల్ఫియా పఠాన్ కూడా బై కారణంగా ముందంజ వేశారు.
మహిళల విభాగం 54 కేజీల కేటగిరీలో ప్రీతి పవార్ కజకిస్థాన్కు చెందిన ఎలీనా బజారోవాతో తలపడనుండగా.. 60 కేజీల కేటగిరీలో ప్రియా, రిమ్మా వోలాసెంకోని ఢీకొననుంది. ఇదే కేటగిరీలో పూజ రాణి కూడా కజకిస్థాన్ బాక్సర్ ర్యాబెట్స్తో తలపడుతుంది. అటు పురుషువ విభాగంలో విశ్వనాథ్ సురేశ్, కజకిస్థాన్ బాక్సర్ ఎర్గోషెవ్తోనూ, జాదుమణి సింగ్ జపాన్కు చెందిన టాప్ సీడ్ యమగుచితోనూ తలపడనున్నారు.




