6 July, 2026 | 3:57 PM

Breaking News

ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •  

బిత్తిరి సత్తిపై కేసు నమోదు

08-08-2024 03:11 AM

భగవద్గీతను కించపరిచారని ఫిర్యాదు 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): టీవీ పేరడీ షోలతో పాపులారిటీ సంపాదించుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో కేసు నమోదైంది. భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడంటూ ఆయనపై రాష్ట్రీయ వానరసేన జాతీయ అధ్యక్షు డు నామ్ రామ్‌రెడ్డి మంగళవారం సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బిత్తిరి సత్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, బిల్లుగీత అంటూ బిత్తిరి సత్తి పేరడీగా ఒక షార్ట్ వీడియో చేశాడు. ఆ వీడియోలో భగవద్గీతను అనుకరిస్తూ తనదైన శైలిలో వ్యంగ్యం గా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఆ వీడియోను తొలగించి క్షమాపణలు  చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.