11 May, 2026 | 12:17 PM

Breaking News

ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •  

నమ్మకమే వివాహానికి మూలం

08-08-2024 03:10 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): నమ్మకం, అర్థం చేసుకునే తత్వం అనేవి వివాహానికి మూల స్తంభాలు అని హైకోర్టు అడ్వకేట్ విజేత బొరకటి, ప్రొ.పీ జ్యోతి అన్నారు. దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్‌లో బుధవారం ‘ఉమెన్ ప్రొటెక్షన్ సెల్’, ‘దుర్గా స్రవంతి సంస్థ’, ‘ఆల్ ఇండియా లైనెస్ క్లబ్‘ ఆధ్వర్యంలో కళాశాల డైరెక్టర్, ప్రొ.విజయలక్ష్మి కంతేటి అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు.. యువత వివాహానికి సిద్ధమైనపుడు కలిగి ఉండాల్సిన అవగాహన గురించి వివరించారు. భారత న్యాయసంహితలోని వివిధ సెక్షన్ల ఉపయోగాలు, అత్యవసర సమయంలో డయల్ చేయాల్సిన నంబర్ల గురించి తెలిపారు.