calender_icon.png 29 June, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోఠి ఈఎన్‌టీకి కోటి తిప్పలు!

29-06-2025 02:43:07 AM

  1. కూలేదాక బేఫికర్.. పురాతన బిల్డింగ్‌లోనే ఓపీ సేవలు 
  2. వైద్యులు, ఫార్మసిస్టులు, నర్సుల కొరతతో రోగులకు కష్టాలు
  3. కీలకమైన సర్జరీలకు బయటినుంచే వైద్యులు 

(పెద్ది విజయభాస్కర్) :

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాం తి): చెవి, ముక్కు, గొంతు సంబంధిత చికిత్సలు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే దవాఖాన కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ప్రభుత్వ రంగంలో ఏకైక ఈఎన్‌టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇదే. 1955 లో ప్రారంభమైన ఈ హాస్పిటల్ నేటికీ సేవల్లో అత్యుత్తమంగా నిలుస్తోంది. నిజానికి ఈ దవాఖాన 1933లో ఓ పార్శీ వ్యా పారి నిర్మించుకున్న భవనం. ఇప్పటికీ అదే పురాతన భవనంలో ఆస్పత్రి కొనసాగుతోంది.

హెరిటేజ్ బిల్డింగ్ కావడంతో కేవ లం గ్రౌండ్‌ఫ్లోర్ మాత్రమే వినియోగిస్తున్నారు. హాస్పిటల్ కోసం పక్కనే జీ ప్లస్ త్రీ భవనాన్ని నిర్మించినా, అది ఏ మూలకు సరిపోవడం లేదు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి కూడా రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యఆరోగ్య శాఖలోని ప్రొఫెసర్ల బదిలీలు చేసినప్పుడు ఇక్కడ కీలకంగా సర్జరీలు నిర్వహించే ప్రొఫెసర్లు బదిలీ అయ్యారు.

దీంతో కాక్లీయర్ ఇంప్లాంటేషన్ సర్జరీలప్పుడు బదిలీపై ఇతర ప్రాంతా లకు వెళ్లిన ప్రొఫెసర్లపై ఆధారపడాల్సి వస్తోంది. వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా.. తమ స్థాయి లో రోగులకు సేవలు అందిస్తున్నారు. దవాఖానాలో ఇందుకు సిబ్బంది కోటి తిప్పలు పడాల్సి వస్తోంది.

వేధిస్తున్న వైద్యుల కొరత..

ఆస్పత్రిలో వారంలో 6 రోజుల పాటు 6 యూనిట్లు సేవలందించేవి. ఒక యూనిట్‌కు ఒక ప్రొఫెసర్ ఇన్‌చార్జిగా ఉంటూ వైద్యసేవలు అందించేవారు. వీరికి అదనంగా 5గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 15 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండేవారు. మొత్తంగా 26 మంది వైద్యులు రోగులకు సేవలు అందించేవారు. అప్పట్లోనే ఒక ప్రొఫెసర్ బదిలీపై వెళ్లారు. తర్వాత కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీర్ఘకాలికంగా ఉన్న ప్రొఫెసర్లను బదిలీ చేస్తున్నామనే పేరు తో కోఠి ఈఎన్‌టీలో రోగులకు చక్కని సేవ లు అందించే వారిని కూడా జిల్లాలకు బదిలీ చేశారు.

జిల్లాల్లో కీలకమైన కాక్లీయర్ సర్జరీలు చేసే అవకాశాలు, సౌకర్యాలు లేకపో యినా బదిలీలు చేయడంతో కీలకమైన వై ద్యుల సేవలు అక్కరకు రాకుండా పోయా యి. ప్రస్తుతం బదిలీలు, పదోన్నతుల తర్వా త కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు.

దీనికి తోడు నలుగురు ఫార్మసిస్టులు ఉండాల్సిన చోట కేవలం ఒక్కరే ఉన్నారు. 36 మంది నర్సులకు గాను 11 ఖాళీలున్నా యి. చివరకు సూపరింటెండెంట్ కూడా తన పర్యవేక్షణ విధులతో పాటు రెగ్యులర్ డాక్టర్‌గా వైద్యసేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం సుమారు 1,300 నుంచి 1,500 వరకు వచ్చే రోగులకు సేవ లు అందించడం వీరికి కష్టసాధ్యంగా మారింది. 

ఎప్పుడు పడిపోతుందో తెలియని భవనంలో..

ప్రస్తుతం కోఠీ ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ప్రవేశించగానే కనిపించే పురాతన భవనమే ఒకప్పటి వరకు ప్రధాన ఆస్పత్రిగా ఉండేది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో అదనంగా జీ ప్లస్ త్రీ భవనాన్ని నిర్మించారు. అయినా వై ద్యసేవలకు ఏమాత్రం సరిపోని పరిస్థితి రా వడంతో 2019లో రూ.35కోట్లతో జీ ప్లస్ ఫైవ్ భవనాన్ని నిర్మించేందుకు పనులు ప్రా రంభించినా వివిధ కారణాలతో నేటికీ పునాదుల వద్దే ఆగిపోయింది.

ఇటీవలే అధికారు లు ఈ భవన నిర్మాణంపై సమీక్ష జరిపినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కొత్త భవ నం అందుబాటులోకి రావడంతో పాటు కీలకమైన వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయకుంటే ఎంతో ఘనత వహించిన కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్ సేవలు రోగులకు కష్టంగానే మారనున్నాయి. 

1933లో దవాఖాన ప్రారంభం

బదిలీలు, పదోన్నతుల తర్వాత కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఇద్దరు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 8 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మాత్రమే మిగిలారు. నలుగురు ఫార్మసిస్టులు ఉండాల్సిన చోట ఒక్కరే ఉన్నారు. 36 మంది నర్సులకు గాను 11 ఖాళీలున్నాయి. చివరకు సూపరింటెండెంట్ కూడా తన పర్యవేక్షణ విధులతో పాటు రెగ్యులర్ డాక్టర్‌గా వైద్యసేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిత్యం సుమారు 1,300 నుంచి 1,500 వరకు వచ్చే రోగులకు సేవలు అందించడం వీరికి కష్టసాధ్యంగా మారింది. 

అందే సేవలు ఇవే.. 

చెవి సంబంధ చికిత్సల్లో వినికిడి లోపం పరీక్షలు, చికిత్స, చెవి ఇన్ఫెక్షన్లు, టింపనోప్లాస్టీ, మూగ, చెవిటి వారికి చికిత్స అందించి బాగు చేసే కాక్లీయర్ ఇంప్లాంట్ సర్జరీ తదితర సేవలు అందుతాయి. ముక్కు సంబంధిత వైద్యసేవల్లో సెప్టోప్లాస్టీ, నాసల్ పాలిప్స్, అలెర్జిక్ రైనైటిస్, నాసల్ అబ్‌స్ట్రక్షన్, నాసల్ ఎండోస్కోపీ వంటి సేవలు లభిస్తాయి. గొంతు సంబంధిక సేవల్లో వోకల్ కార్డ్ నాడ్యూల్స్, వోకల్ కార్డ్ పాలిప్స్, వాయిస్ థెరపీ, లారింగోస్కోపీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, టాన్సిల్స్, అడెనాయిడ్స్ తదితర వైద్య సేవలు అందిస్తాయి.

ఆడియాలజీ, వెర్టిగో, హెడ్ అండ్ నె, ఎమర్జెన్సీ ఈఎన్‌టీ, పీడియాట్రిక్ ఈఎన్‌టీ సేవలు చక్కగా లభిస్తాయి. 1,500 వరకు ఔట్‌పేషెంట్లతో పాటు 150 మంది ఇన్‌పేషెంట్స్ సేవలు పొందుతారు. ఇక్కడ మెరుగైన వైద్య సేవలు అందుతాయని అయితే సమస్యంతా వైద్యుల కొరతేనని సురేందర్ అనే రోగి ‘విజయక్రాంతి’కి తెలిపారు. ఒకప్పుడు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేలా సేవలు అందేవని..ఇప్పుడు వైద్యుల కొరతతో ఉదయం వస్తే మధ్యాహ్నం వరకు కూడా సేవలు కష్టంగా ఉన్నాయని పేర్కొన్నారు.

మెరుగైన సేవలు అందిస్తున్నాం..

వైద్యుల కొరత ఉన్నా కూడా రోగులకు సేవలు అందిస్తున్నాం. హెరిటేజ్ బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే వినియోగిస్తున్నాం. కొత్త భవన నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. తిరిగి ప్రారంభించేందుకు ఇటీవలే ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేసింది. రోగులు క్యూలో ఎక్కువ సేపు నిలబడకుండా ఉండేందుకుగాను అభా (ఏబీహెచ్‌ఏ) యాప్ ద్వారా స్కానింగ్ చేసి వైద్య సేవలు త్వరగా అందేలా ఏర్పాట్లు చేశాం.

డా. ఆనంద్ ఆచార్య, సూపరింటెండెంట్