calender_icon.png 26 June, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పిస్తా హౌస్ జ్యూస్‌లో ఈగ

04-06-2025 12:07:59 AM

గతంలో బిర్యాని కర్రీలో కాయిన్స్... 

 రాజేంద్రనగర్, జూన్ 3: సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ లో ఉన్న పిస్తా హౌస్‌లో ఓ వినియోగదారుడికి జ్యూస్ లో ఈగ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో వినియోగదారుడు ఒక్క సారిగా కంగుతిన్నాడు. ఈ సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. వివరాలు.. మూడు రోజుల క్రితం ఓ వినియోగదారుడు అత్తాపూర్ లో ఉన్న పిస్తా హౌస్ లో బిర్యాని తింటూ జ్యూస్ ఆర్డర్ ఇచ్చాడు.

కొద్దిగా జ్యూస్ తాగిన తర్వాత అందులో ఈగ కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. ఈ విషయమై అతడు వెంటనే హోటల్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాడు. ఈగ పొరపాటున వచ్చిందని పిస్తా హౌస్ యాజమాన్యం వినియోగదారుడికి నిర్లక్ష్యంగా తెలియజేసింది. దీంతో అతడు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయం మంగళవారం  జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

గతంలో కాయిన్స్

 జ్యూస్ లో ఈగ వచ్చినా ఘటన కలకలం రేపుతుండగా ఇదే అత్తాపూర్ లోని పిస్తా హౌస్ లో గతంలో ఇద్దరు కస్టమర్లు బిర్యాని తింటుండగా కర్రీలో కాయిన్స్ రావడం కలంకలం రేపింది. అప్పట్లో తనిఖీలు చేసి విచారణ జరిపిన జిహెచ్‌ఎంసి ఫుడ్ సేఫ్టీ అధికారులు పిస్తా హౌస్ కు జరిమానా విధించారు.

మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన ఫలితం లేకుండా పోయింది. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హోటళ్లపై జిహెచ్‌ఎంసి అధికారుల పర్యవేక్షణ లేకుండా పోవడంతో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వినియోగదారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు