04-06-2025 12:04:58 AM
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్
కామారెడ్డి, జూన్ 3 (విజయ క్రాంతి): కామారెడ్డి ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల {స్వయం ప్రతిపత్తి),కామారెడ్డిలో ఈ విద్యా సంవత్సరం నుండి B.Sc( హెల్త్ కేర్ మేనేజ్మెంట్) (ఏఈడిపి) ప్రవేశపెడు తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే.విజయ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీలో B. A, B. Sc లైఫ్ సైన్స్,B.Sc ఫిజికల్ సైన్స్, B. Sc (హానర్స్ ) కంప్యూటర్ సైన్స్, B. Com కంప్యూటర్ అప్లికేషన్స్, BBA, కోర్సులు నిర్వహి స్తుండగా
ఈ విద్యా సంవత్సరం నుండి B. Sc (హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ) (ఏ ఈడిపి) అందుబాటులో రానున్నట్లు ఈ కోర్సులో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు రెండో విడత దోస్త్ రిజిస్ట్రేషన్ లో ఈ కోర్సును ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో యూజీ, పీజీ కోర్సులను నిర్వహిస్తూ బోధనలో సాంకేతికత,డిజిటల్ క్లాసులు కలిగి 60 వసంతాలకు పైగా విద్యాసేవనిందిస్తున్న విశిష్ట కళాశాల ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాలని,
డిగ్రీలో దోస్త్ రెండో విడత ఈ నెల 8వ తారీకు వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు అవకాశాన్ని వినియోగించు కొని కళాశాలలో ప్రవేశం పొంది ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కామారెడ్డి ప్రాంత విద్యార్థులను కోరారు.