14-10-2024 12:09:03 AM
రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. అనిత సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియేష న్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కియారా అద్వాని నటిస్తోంది. ఈ చిత్రం విడుదలపై తాజా గా దిల్ రాజు స్పష్టత ఇచ్చారు. ఆ
యన మాట్లాడుతూ.. “గేమ్ చేంజర్’ను ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నాం. కానీ ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేస్తున్నాం కాబట్టి సంక్రాంతి అయితే బాగుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్సీస్లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అంతా భావించాం.
చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా సంక్రాంతికి వస్తోంది. ఈ క్రమంలోనే సంక్రాంతి డేట్ కావాలని వారిని అడిగితే సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే విశ్వంభర రిలీజ్ డేట్ మార్చాలనుకున్నారు. అన్నీ ఓకే అయ్యాయి కాబట్టి గేమ్ చేంజర్ను సంక్రాంతి బరిలో నిలుపుతున్నాం” అని దిల్ రాజు ప్రకటించారు.