10 May, 2026 | 9:31 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు

30-06-2025 05:16 PM

ములుగు (విజయక్రాంతి): పోలీస్ డిపార్ట్మెంట్లో తమ సర్వీస్ పూర్తి చేసుకుని ఈరోజు పదవీ విరమణ చేసిన ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ ఎం.రవీందర్, ఎన్.కనకయ్య, ఏఆర్ఎస్ఐ కె.సుబ్బరాయుడు, సీసీఎస్ నందు విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఏ.రామకిష్టయ్య, పిసిఆర్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్  సిహెచ్ చుక్కయ్యకు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో ములుగు జిల్లా ఎస్పీ శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డా.శబరిష్.పి ఐపీఎస్ (District SP Dr. Shabarish.P IPS) మాట్లాడుతూ... ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఐ ఎం.రవీందర్, ఎన్.కనకయ్య, ఏఆర్ఎస్ఐ కె.సుబ్బరాయుడు, సీసీఎస్ నందు విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఏ.రామకిష్టయ్య, పిసిఆర్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ చుక్కయ్యలు పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా సేవలందించి సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీస్ విభాగంలో సుధీర్ఘ కాలంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సిబ్బంది సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని అన్నారు పోలీసు రిటైర్ మెంట్ కేవలం వారి వృత్తికే, కాని వారి వ్యక్తిత్వానికి కాదని కొనియాడారు.

విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి విధులు నిర్వహించారు. పదవి విరమణ చేసిన పోలీసులు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ములుగు డి.ఎస్.పి రవీందర్, ఎస్బి ఇన్స్పెక్టర్ శంకర్, ఆర్ఐ లు స్వామి, సంతోష్, తిరుపతి, పదవి విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది పాల్గొన్నారు.