17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఘనంగా 'అరుణోదయ' విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

27-07-2025 10:21 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని అరుణోదయ ఉన్నత పాఠశాల 1999–2020 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. మండలంలోని అందుగులపేట శివసాయి ఫంక్షన్ హాల్ లో ఆదివారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ముఖ్యఅతిథులుగా సౌత్, వెస్ట్ జోన్ హైదరాబాద్ సిటీ పోలీస్ డిసిపి జి చంద్రమోహన్(DCP G Chandramohan), పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి(CI Shashidhar Reddy)లు హాజరయ్యారు. 25 సంవత్సరాల విరామం అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి బాల్య మిత్రులందరూ ఒక్క చోట చేరి సందడి చేశారు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యా బుద్ధులు నేర్చుకున్న పాఠశాలలో కలుసుకొని అలనాటి జ్ఞాపకాలతో ఆత్మీయంగా పలకరించుకొని, గత స్మృతులను, పాఠశాలలో చేసిన అల్లరి పనులను గుర్తు చేసుకొని సందడి చేశారు. సుదీర్ఘ విరామం అనంతరం పూర్వ విద్యా ర్థుల ఆత్మీయ సమ్మేళనంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పి తమ జీవితాలను మలుపు తిప్పిన గురువులను  ఘనంగా సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక వేడుకలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.