17 April, 2026 | 11:55 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పైసా ఖర్చు లేకుండా వైద్యం అందించండి.!

27-07-2025 10:18 PM

వైరా రోడ్డులో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న కారు..

కాన్వాయ్ లో క్యాంపు కార్యాలయానికి వస్తు ఘటనను చూసి ఆగిన మంత్రి పొంగులేటి..

వెంటనే కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని ట్రాఫిక్ సీఐకు ఆదేశాలు..

ఖమ్మం (విజయక్రాంతి): ఆపదలోనూ నేనున్నా అని మరోమారు చాటుకున్నారు తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) వైరా రోడ్డులోని ఎస్ఆర్ గార్డెన్స్ సమీపంలో ఆదివారం సాయంత్రం కారు ఢీకొన్న ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఇదే సమయంలో కొత్తగూడెం నియోజవకర్గ పర్యటనను ముగించుకుని ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయానికి వస్తున్న మంత్రి పొంగులేటి ఆ ఘటనను చూసి కాన్వాయ్ ను ఆపారు. అధైర్యపడొద్దని నేనున్నానని ప్రమాదంలో గాయపడిన యువకులకు భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ సీఐ సాంబశివరావును దగ్గరకు పిలిచి క్షతగాత్రులను త్వరగా కిమ్స్ ఆసుపత్రికి తరలించాలని సూచించారు. పైసా ఖర్చు లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా వైద్యులను ఆదేశించారు.