12-09-2025 12:00:00 AM
యాచారం సెప్టెంబర్ 11 : రంగారెడ్డి జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన యాచారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.నరసింహను స్థానిక పాఠశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.
విద్యార్థులకు ఆయన చేసిన సేవలను పాఠశాల అధ్యాపక బృందం కొనియాడుతూ. వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధత అతన్ని ఈ స్థాయికి చేర్చాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులుఆనంద్ , జోసెఫ్,గోవర్ధన చారి, గోపాల్, జగదీష్ కుమార్, వెంకట్ రెడ్డి, విజయకుమారి, నీరజ, మమత, పాల్గొన్నారు.