calender_icon.png 12 September, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ప్రధానోపాధ్యాయుడికి ఘన సన్మానం

12-09-2025 12:00:00 AM

యాచారం  సెప్టెంబర్ 11  : రంగారెడ్డి జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయులుగా ఎంపికైన యాచారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కె.నరసింహను స్థానిక పాఠశాల అధ్యాపక బృందం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ. 

విద్యార్థులకు  ఆయన చేసిన సేవలను పాఠశాల అధ్యాపక బృందం కొనియాడుతూ. వృత్తి పట్ల అంకిత భావం, నిబద్ధత అతన్ని ఈ స్థాయికి చేర్చాయి. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులుఆనంద్ , జోసెఫ్,గోవర్ధన చారి, గోపాల్, జగదీష్ కుమార్, వెంకట్ రెడ్డి, విజయకుమారి, నీరజ, మమత, పాల్గొన్నారు.