23-06-2025 01:24:58 AM
బూర్గంపాడు, జూన్ 22 (విజయక్రాంతి): ఎస్ జేపీమ్ బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల 1988- ఇంటర్ మీడియట్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమావేశం ఆదివారం ఘనంగా జరిగింది. జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాలు నుండీ విద్యార్థులు తరలివచ్చారు 35 సంవత్సరాల తర్వాత కలుసుకున్న విద్యార్థులు గత జ్ఞాపకాలను పంచుకున్నారు ఉదయం కాలేజీలోని సరస్వతి మాతాకు పూలమాల వేశారు.
ఆ తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ప్రారంభించారు 1988 బ్యాచ్ జూనియర్ కళాశాల విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు నలజాల వెంకటరావు అధ్యక్షతన పూర్వ విద్యార్థులు సమావేశమై కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తీర్మానించారు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు రాబోయే కాలంలో కూడా జరపాలని నిర్ణయించారు ఈ బ్యాచ్ లోని పూర్వ విద్యార్థుల సమాచారాన్ని మరింతగా పూర్వ వి ద్యార్థులను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు.
ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళన సమావేశంలో అప్పటి విద్యార్థి సంఘం నాయకులు నలజా ల వెంకటరావు, తోటా కోటేశ్వరరావు, రెడ్డెం నరసింహారెడ్డి ఉమామహేశ్వరరావు రామ్ లాల్, రామారావు పి వెంకటేశ్వర్లు రాజ్యలక్ష్మి కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అనంతరం పూర్వ విద్యార్థి సంఘ నాయకులందరినీ ఘనంగా సన్మానించారు తమకు చదువు నేర్పిన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.