calender_icon.png 24 October, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ములుగు జిల్లా కేంద్రంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

22-10-2025 12:45:45 AM

ములుగు,అక్టోబర్21(విజయక్రాంతి): నాడు విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసి అమరులైన పోలీసులకు ములుగు జిల్లా ఎ స్పీ డాక్టర్ శబరీష్.పి అమరవీరుల కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీస్ అధికారులతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ‘ఈరోజు మనం పోలీస్ ఫ్లాగ్ డే ను గంభీరంగా పాటిస్తున్నాము. ఈరోజు మన దేశశాంతి భ ద్రత కోసం ప్రజల రక్షణ కోసం తన ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరులను స్మ రించుకునే రోజు.

1959 అక్టోబర్ 21రోజు ల డాకులోని హార్ట్ స్ప్రింగ్స్ వద్ద చైనా దళాల దాడిలో పదిమంది ధైర్యవంతులైన భారతీ య పోలీసులు సరిహద్దులను కాపాడుతూ వీరమరణం పొందారు ఆ ఘటన స్మారకార్థంగా ప్రతి సంవత్సరం ఈరోజు దేశవ్యాప్తం గా పోలీస్ ఫ్లాగ్ డేని నిర్వహిస్తాము. ఈరోజు మనం తలవంచు ఆవీరుల త్యాగానికి నివాళులు అర్పిస్తున్నాము వారి పేర్లు స్మారక స్థూపాలపై చెక్కబడి ఉంచవచ్చు కానీ వారి ఆత్మ వారి ధైర్యం వారి సేవ మనందరిలో స జీవంగా ఉన్నాయి.

పోలీస్ సేవ అనేది ఉద్యో గం కాదు అది ఒక బాధ్యత, త్యాగం మరి యు ప్రజాసేవ పట్ల అంకితభావం. ప్రతి పో లీస్ అధికారి విధులకు బయలుదేరినప్పుడుతేదీన భద్రత కోసం కృషి చేయడానికి తమ ప్రాణాన్ని పణంగా పెట్టి ప్రజల భద్రత కో సం కృషి చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇదే మన వృత్తి యొక్క మహత్యం. ములు గు జిల్లా సవాళ్లతో కూడిన అడవి ప్రాంతా లు మావోయిస్టు ప్రభావిత మండలాలు మ రియు దూర గ్రామాలు ఉన్నప్పటికీ మావోయిస్టు ప్రజలతో మండలాలు మరియు దూ ర గ్రామాలు ఉన్నప్పటికీ మన సిబ్బంది ధైర్యంగా నిబద్ధతతో విధులను నిర్వహిస్తున్నారు.

శాంతి భద్రతల పరిరక్షణ నేరాల ని రోధం వరదలు మరియు అత్యవసర పరిస్థితులలో ప్రజలకు సహాయం చేయడంలో ములుగు పోలీసులు నిరంతరం ముందంజ లో ఉన్నారు ఈరోజు మనం పోలీస్ అమరవీరుల స్మారక స్థూపం వద్ద నిలబడి త్యాగా న్ని స్మరించి వారి పరంపరను కాపాడటానికి మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం. మన బాధ్యతలను నిజాయితీ క్రమశిక్షణ కరుణ మరి యు నైతిక భావంతో నిర్వర్తిద్దాం ఎందుకం టే మన అమరులు విలువల కోసం తమ ప్రాణాలను అర్పించారు.

మన అమరుల కు టుంబాలకు మనస్ఫూర్తిగా మన గౌరవం మరియు సానుభూతి. మీ త్యాగం అమూ ల్యం. పోలీస్ విభాగం ఎల్లప్పుడూ మీతో తోడుగా ఉంటుంది. ఈరోజు మన బలం ఐక్యతలో ఉన్నది మన శక్తి నిజాయితీలో ఉన్నదని మన ధ్యేయం ప్రజాసేవలో ఉన్నదని గుర్తు చేస్తున్నది మన అమరుల త్యాగం మనకు స్ఫూర్తిగా నిలుస్తూ ప్రజల భద్రత కోసం అదే ధైర్యం అదే అంకితభావంతో సే వ చేయడానికి మన ఎల్లప్పుడు సిద్ధంగా ఉం డాలి.

జైహింద్‘ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు ఆ తరువాత ములుగు డిఎస్పి రవీందర్ 2024 సంవత్సరం నుండి 2025 వరకు దేశవ్యాప్తంగా ప్రాణాలర్పించిన పోలీ స్ అమరవీరుల వివరాలను తెలియజేస్తూ వారికి స్మరిస్తూ నివాళి అర్పించారు. తదనంతరం జిల్లా ఎస్పి పోలీస్ అమరవీరుల స్మా రక స్థూపం వద్ద పుష్పగుచ్చంతో నివాళులు అర్పించారు. అదే విధంగా అమరవీరుల కుటుంబ సభ్యులు, జిల్లా పోలీస్ యంత్రాం గం, అందరూ పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించారు.