26-09-2025 12:34:04 AM
హన్వాడ సెప్టెంబర్ 25 : మండలంలోని టంకర గ్రామానికి చెందిన నవనీత అనే వి ద్యార్థిని అత్యంత కఠినమైనటువంటి నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంబిబిఎస్ సీట్ పొంది హన్వాడ మండల బీజేవైయం ఆధ్వర్యంలో తల్లి తండ్రులతో పాటు నవనీతకు సన్మానం చేశారు. ఇందులో భాగంగా రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు ఎర్ర చంద్రశేఖర్, టంకర గ్రామ బిజెపి పెద్దలు, హనుమంతు, చంద్రయ్య, పాండు , శ్రీనివాస్ గౌడ్, చెన్నయ్య, కార్యకర్తలు యువత అరవింద చారి, పాండు, రాములు, తదితరులు పాల్గొన్నారు.