వైద్యుల నైపుణ్యంతో రోగికి కొత్త జీవితం
01-04-2026 12:00 AM
వేములవాడ, మార్చి 31,(విజయక్రాంతి): వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుప త్రిలో అరుదైన మత్తు విధానంతో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లాకు చెందిన 60 ఏళ్ల మహిళకు షుగర్ సమస్యతో పాటు నోరు పూర్తిగా తెరవలేని పరిస్థితి ఉండటంతో జనరల్ అనస్థీషియా సాధ్యం కాలేదు. దీంతో డా. పెంచలయ్య నే తృత్వంలో డా. తిరుపతి, రాజశ్రీలు సెగ్మెంటల్ థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ బృందాన్ని సూపరిండెంట్ డా. రవీందర్ అభినందించగా, ప్రజలు ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.




