calender_icon.png 23 June, 2025 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..

22-06-2025 08:10:46 PM

కొండపాక: బైక్ అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకుపోయి వ్యక్తి మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండల(Kukunoorpally Mandal) కేంద్రంలో చోటుచేసుకుంది. కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్(SI Srinivas) తెలిపిన కథనం మేరకు.. అన్నారం గ్రామం గుమ్మడిదల మండలం సంగారెడ్డి జిల్లాకు చెందిన వినయ్ కుమార్ సింగ్(27) సిద్దిపేట జిల్లాలో గల రంగనాయక సాగర్ డ్యాం చూడడానికి తన స్నేహితులతో కలిసి వెళుతున్న క్రమంలో కుకునూరు పల్లి గ్రామ శివారులో శ్రీ వెంకటేశ్వర రెడీమిక్స్ కంపెనీ గేటు ముందు అదుపుతప్పి బైక్ చెట్ల పొదల్లోకి దూసుకుపోయి మృతి చెందాడని, మృతుడి తల వెనుక భాగం కమీలిన గాయాలు కాళ్లకు, చేతులకు స్వల్ప గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

వెనకనే వస్తున్న అతడి స్నేహితులు ఫోను ద్వారా మృతుడి తండ్రికి సమాచారం ఇవ్వగా, మృతుడి తండ్రి వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చూడగా తన కుమారుడు వినయ్ కుమార్ సింగ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుక్కునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.