14 April, 2026 | 4:59 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

సీఐ ఆధ్వర్యంలో పోలీసుల కవాతు

13-12-2025 12:20 AM

ధర్మపురి,డిసెంబర్12 (విజయక్రాంతి): 2వసాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వుల మేరకు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సూచనలతో ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు కవాతు నిర్వహించారు. నేరేళ్ల, రాయపట్నం, వెల్గటూర్ గ్రామాలలో ఫ్లాగ్ మార్చి నిర్వహించారు.

అనంతరం సీఐ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. ఓటు హక్కునీ ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఎన్నికల నిబంధనలను అందరూ విధిగా పాటించాలనీ ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో ఎస్త్స్రలు మహేష్, ఉదయ్ కుమార్, కృష్ణసాగర్ రెడ్డి, సతీష్ , రవీందర్ కుమార్ మరియు కానిస్టేబుల్స్‌పాల్గొన్నారు.