calender_icon.png 30 December, 2025 | 5:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్షర జాతరకు రికార్డు జనం!

30-12-2025 01:33:02 AM

  1.   16 లక్షల మందితో సరికొత్త చరిత్ర
  2. ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్
  3. రాజ్యాంగాన్ని ‘పాకెట్ సైజు’లో సామాన్యులకు అందించాలి
  4. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి
  5. పుస్తక రంగంలో అగ్రగామిగా ఎదగాలి
  6. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి

ముషీరాబాద్, డిసెంబర్ 29 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరం నడిబొడ్డున గల ఎన్టీఆర్ స్టేడియంలో 11 రోజుల పాటు సాగిన అక్షరాల పండుగ ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ రికార్డు స్థాయి సందర్శకులతో ము గిసింది. గత ఏడాది 12 లక్షల మంది రాగా, ఈసారి ఆ సంఖ్య ఏకంగా 16 లక్షలకు చేరుకుందని, అందులో 70 శాతం మంది యువతే ఉన్నారని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, కవి యాకూబ్, కార్యదర్శి వాసు వెల్లడించారు. కాగా సోమవారం నిర్వహించిన ము గింపు సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్‌రెడ్డి ముఖ్య అతి థిగా హాజరై ప్రసంగించారు.

భారత రాజ్యాంగాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగు లో పాకెట్ సైజు ప్రతిగా ముద్రించి అతి తక్కువ ధరకు వచ్చే ఏడాది అందుబాటులో ఉంచాలని కోరారు. ఇందుకు ఎవరూ ముం దుకు రాకపోతే తాను స్వయంగా తోడ్పాటు అందిస్తానని ప్రకటించారు. సెల్‌ఫోన్లు, సినిమాలకు దూరంగా యువత ఇంత పెద్ద ఎత్తు న తరలిరావడం సమాజ మేధో అంతర్మథనానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగం అందరికీ అందాలన్నారు.

ప్రస్తు త డిజిటల్ యుగంలో సెల్ ఫోన్లు, సినిమాలకు దూరంగా యువత ఇంత పెద్ద ఎత్తున పుస్తక ప్రదర్శనకు రావడం సమాజంలోని మేధో అంతర్మథనానికి నిదర్శనమని జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వప్రకటన స్వేచ్ఛ కు ఈ వేదిక అద్దం పడుతోందని, గాంధీజీ నుంచి ఆయనను విమర్శించే వారి వరకు అందరి పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉండటం శుభపరిణామమని కొనియాడా రు. వేదికలపై మహిళా ప్రాతినిధ్యం తక్కువగా ఉండటంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

సమానత్వం గురించి కేవలం మాట ల్లో కాకుండా, పుష్ప చక్రపాణి వంటి మేధావులను వేదికలపైకి ఆహ్వానించి ఆచరణలో చూపాలని హితవు పలికారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక రంగంలో కంటే పుస్తక పఠనంలో మనం ప్రపంచ అగ్రగామిగా ఎదగాలన్నారు. వ్యవసాయ, పశుసంవర్ధక పరి శోధనలు రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. పుస్తక విరాళాల కార్యక్రమం ఒక గొప్ప సామాజిక ఆశయమన్నారు.

అంబేద్కర్ విశ్వవిద్యాలయం వీసి ఘంటా చక్రపా ణి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల పరిశోధనా పత్రాలను ప్రజలకు చేరువ చేయాల న్నారు. కేవలం అమ్మకాలే కాకుండా కులతత్వం, మతతత్వం వంటి సామాజిక సమ స్యలపై లోతైన చర్చలు నిర్వహించి పాఠకులలో అవగాహన కల్పించాలన్నారు. సీనియ ర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి మా ట్లాడుతూ.. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను అంతర్జాతీయ స్థాయి ‘లిటరరీ ఫెస్టివల్’గా మార్చాలని సూచించారు.

జాతీయ మేధావులను ఆహ్వానించి విభిన్న విచారధారలపై పది రోజుల పాటు చర్చలు నిర్వహించాలన్నారు. ప్రొఫెసర్ రమా మెల్కోటే మాట్లాడుతూ.. ఏటా స్టాళ్ల ఏర్పాటు వ్యయాన్ని తగ్గించేందుకు స్టేడియంలో శాశ్వత కట్టడాలు నిర్మించాలని కోరారు.  బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్ మాట్లాడుతూ.. పుస్తక ప్రదర్శన కేవలం మేళా కాదు, సామాజిక చైతన్య కేంద్రమని పేర్కొన్నారు. యువత అక్షరాల పండుగకు ఇస్తున్న గౌరవం భవిష్యత్తు తరాలకు ఒక గొప్ప సూచికన్నారు.

38 ఏళ్ల ఈ ప్రయాణంలో పాఠకుల ఆదరణ మరువలేనిదన్నారు. కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. 11 రోజుల్లో 16 లక్షల మందిని ఆకర్షించి పాత రికార్డులను తిరగరాశామని చెప్పారు. 450 స్టాళ్లను పారదర్శక లాటరీ పద్ధతిలో కేటాయించామన్నారు. బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 280 మందికి పైగా కవులు, రచయితలు ఈ వేదికపై మాట్లాడాటం హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు గర్వకారణమన్నారు.