calender_icon.png 31 May, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్‌లో దయలేని ప్రభుత్వం

30-05-2025 02:52:26 AM

  1. ముర్షిదాబాద్, మాల్డా ఘర్షణలు క్రూరత్వ పాలనకు నిదర్శనం
  2. మమతా ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు
  3. ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తవ్వలేదని వెల్లడి

కోల్‌కతా, మే 29: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం మిగిలి ఉండగానే ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా మధ్య మాటల యుద్ధం మొదలైంది. గురువారం అలీపుర్‌దుర్‌లో  బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక్కడ ప్రజలపై దయలేని ప్రభుత్వం కొ నసాగుతోందన్నారు ముర్షిదాబాద్, మాల్డాలో చెలరేగిన ఘర్షణలు బెంగాల్ ప్రభుత్వ క్రూరత్వ పాలనకు నిదర్శమని దుయ్యబట్టారు.

మమత ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. ప్రభుత్వాన్ని నడిపేది ఇలాగే నా అని మండిపడ్డారు. బుజ్జగింపు రాజకీయాల పేరిట గూండాలకు స్వే చ్ఛనిచ్చారన్నారు. ఇక్కడ ప్రతి సమస్యకు కోర్టు జోక్యం చేసుకోవాల్సి వ స్తోందని, లేకపోతే ఏదీ పరిష్కారం కాదని మోదీ విమర్శించారు. అనంత రం ఆపరేషన్ సిందూర్‌పై ప్రస్తావించిన మోదీ.. ఆ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదన్నారు. ఈ విషయాన్ని బెంగాల్ గడ్డ మీద నిలబడి 140 కోట్ల మంది భారతీయుల తరఫున ప్రకటిస్తున్నా అని తెలిపారు.