28-06-2025 12:00:00 AM
నిర్మల్,జూన్27(విజయక్రాంతి): మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని 30 రోజుల్లోపు పురిజర్వేషన్ల ప్రక్రియ ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరో అడుగు ముందుకు పడింది. స్థానిక సం స్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్నోసార్లు ప్రకటించినప్పటికీ రిజర్వేషన్ల అంశంపై కోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉం డడంతో ఎన్నికల నిర్వహణ జాప్యం జరిగిన సంఘటన తెలిసిందే.
అయితే స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలలోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించడంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నిర్మల్ జిల్లాలో మొత్తం 19 మండలాలు ఉండ గా బైంసా నిర్మల్ పంచాయతీ డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో 396 గ్రామ పంచాయతీలు ఉండగా ఇటీవలే కాంగ్రెస్ ప్రభుత్వం మరో నాలుగు గ్రామ పంచాయతీలను ప్రకటించడంతో గ్రామపంచాయతీల సంఖ్య 400కు చేరుకుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానమంత్రి సర్పంచ్ ఎన్నికలే కావడంతో గ్రామ పంచాయతీలకు సర్పంచు లు పాలకవర్గ సభ్యులు లేకపోవడంతో నిర్వహ ణ భారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు జనాభా ప్రతిపదికన విడుదల చేసి నిధుల్లో పాలకవర్గాలు లేని కారణంగా నిధుల కొరత విధిస్తోంది. దీంతో గ్రామపంచాయతీలో ప్రజలకు మౌలిక వసతులు కల్పన కో సం ప్రభుత్వ నిధులు రాకపోవడంతో నిధులు లేక నిర్వాణ లేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ బాధితులను గ్రామ కార్యదర్శులకు అప్పగించింది. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నికైన సర్పంచులు 2024 ఫిబ్రవరి ఒకటో పదవీకాలం ముగియడంతో ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పంచాయతీల నిర్వహణ చేపడుతున్నారు. ప్రభుత్వం మారి ప్రజా పాలన ప్రభుత్వం అధికారులకు వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుంది.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్మించాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అయితే ప్రభుత్వం కూడా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు గత ఆరు నెలలుగా అన్ని ఏర్పాట్లను చేస్తుంది.
ఓటర్ల ముసాయిదా జాబితా పోలింగ్ కేం ద్రాల ఏర్పాటు ఎన్నికల సిబ్బందికి శిక్షణ పోలింగ్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు ఎన్నికల నిర్వహణ శాంతి భద్రత పర్యవేక్షణ తదితర అంశాలు అన్నిటిపై ఇప్పటికి కావలసిన కార్యాచరణను రూపొందించుకుని ప్రభుత్వం ఆదే శించిన వెంటనే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు
రిజర్వేషన్లపైనే అందరి చర్చ..
నిర్మల్ జిల్లాలో మొత్తం 400 గ్రామ పం చాయతీలు ఉండగా జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహిస్తారా లేక పాత రిజ ర్వేషన్ల ప్రకారమే ఎన్నికలను నిర్వహిస్తారన్న అంశంపై ప్రభుత్వం అధికారులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. జిల్లాలో 400 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 150 వరకు గిరిజన గ్రామ పంచాయతీలు తండాలే ఉన్నాయి.
జనాభాలో 4౨% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో బీసీలకు అవకాశం దక్కుతుందని ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల తో పాటు బిజెపి, బీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలు తమ తమ మద్దతుదారులను ఎన్నికల్లో పోటీ చేయించి విజయం సాధించేలా కార్యచరణ రూపొందించుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు మూడు పార్టీలకు సవాలుగా మారనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉండగా ఖానాపూర్లో మాత్రమే సిట్టింగ్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తుండగా నిర్మల్ ముధోల్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రామారావు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తున్నా రు.
పదేళ్లపాటు అధికారులు ఉండి గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్యనేత అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కార్యకర్తలు మాత్రం ఆ పార్టీ క్యాడర్ పైనే స్థాని క సంస్థల బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నా రు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులు లేనప్పటికీ పార్టీ మద్దతు ఉంటే గెలుస్తామన్న ధీమాతో ముఖ్య నేతల మంతనాలతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు సంసిద్ధం అవుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామపంచాయతీ సర్పంచ్లకు ఎంతో ప్రాధాన్యత ఉండటం నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసింది వారు ఆసక్తి చూపుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మహిళ వివిధ కేటగిరీలో సర్పస్తుపాటు వార్డ్ మెంబర్లు రిజర్వేషన్లు అమలు చేయను నేపథ్యంలో ఏ గ్రామ పంచాయతీలో ఏ రిజర్వేషన్ వస్తే ఎవరిని నిలబెట్టాలో అని నిర్ణయంతో ముఖ్య నాయకులు అందరూ కూడా తమ ప్రయత్నాలు ప్రారంభించారు.
సర్పంచ్ ఎన్నికల్లో తమ మద్దతుదారులు గెలిస్తేనే తర్వాత జరిగే ఎంపీటీసీ జెడ్పిఎస్టిసి ఎన్ని కల్లో పార్టీ విజయానికి అవి దోహదం చేస్తాయ ని వారు ధీమాతో వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రిజర్వేషన్లతో పాటు ఓపెన్ లో జనరల్ స్థానంలో ఎక్కువ మందిని పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో చదువుకున్న వారు గ్రామంలో పట్టు ఉన్న ఉన్న మహిళలు ఇప్పటికీ సర్పంచ్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని గ్రామాల్లో చర్చ కార్యక్రమం చేపడుతున్నారు.
కలెక్టర్ అభిలాష అభినవ్ స్థానిక సంస్థల కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ నేతృత్వంలో రిజ ర్వేషన్ల అంశంపై త్వరలో కోర్టు తీర్పును అనుసరించి ఖరారు చేసేందుకు అన్ని చర్యలు తీసు కునే అవకాశం ఉంది.
ఎమ్మెల్యేలు కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో తమ మద్దతుదారులను గెలుపొందించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగించే అవకాశం ఉండటంతో ప్రతిపక్ష పార్టీ ల నేతలు కూడా తమ ఉనికి కోసం తమ అనుచరులను పోటీలో దింపి అదృష్టాన్ని పంచుకొ ని ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఎన్నికల నిర్వాణకు ఏర్పాట్లు
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లను ఇప్పటికే 50 శాతం పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో 400 గ్రామపంచాయతీలో ఓటర్ల జాబితా పో లింగ్ బూత్ల ఏర్పాటు పూర్తి చేశాం. ఎన్నికల సిబ్బంది కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం.రిజర్వేషన్ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నందున ప్రభు త్వ నిర్ణయాలకు రిజర్వేషన్లు ప్రకటించి ప్రభుత్వం ఎప్పుడు ఎన్నికలకు నిర్వహణకు ఆదేశిస్తే అప్పుడు దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది.
శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి