27-06-2025 11:11:36 PM
వైద్యులు మెరుగైన వైద్య సేవలు అందించాలి
రహదారులు మెరుగుతో రాకపోకలలో సౌలభ్యం
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం,పలు రోడ్ల పనుల శంకుస్థాపన, ఉచిత వైద్య శిబిరం సందర్శనలో
రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క
మంగపేట,(విజయక్రాంతి): ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పేదల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరంతరంగా కొనసాగిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శుక్రవారం మంగపేట మండలంలోని బ్రాహ్మణ పల్లి, ఎకె మల్లారామ్ గ్రామమాల్లో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజా, నిర్మాణ పనులను, ఎకె మల్లారామ్ గ్రామంలో S.G. కాలనీ లో అంతర్గత అంతర్గత రహదారుల (CC రోడ్లు) నిర్మాణం, అకినేపల్లీ మల్లారం మల్లారం 15.00 లక్షలు, సి/ఓ అకినెపల్లి మల్లారాంలో KM 4/5 వద్ద తక్కువ స్థాయి కారణ మార్గం రూ.242.00 లక్షలు, S/R నుండి R/F R&B రోడ్. అకినెపల్లి మల్లారామ్ KM 2/0 నుండి 4/0 వరకు రూ.200 లక్షల నిధులతో రోడు నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళాశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్ పి షబరిష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్
రవి చందర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం వికాస్ అగ్రి ఫౌండేషన్, నాసి రెడ్డి సాంబశివ రెడ్డి సౌజన్యం తో ఎకె మల్లారామ్, ధోమ్మెడా, కేశవపూర్, చిన్తకుంట గ్రామాల ఎస్ టి రైతులకు 500 ఎకరాలు BPT5204 , MTU 1010 విధానాలను మంత్రి సీతక్క, ఎం పి బలరాం నాయక్ తో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... ఈ రహదారుల పనులు పూర్తయిన తర్వాత ప్రయాణికులకు రాకపోకలలో సౌలభ్యత కలుగుతుందనీ, ములుగు జిల్లాలో అభివృద్ధి మరింత వేగంగా జరగనుందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఏకే మల్లారం అంటే నాకెంతో అభిమానం అని, జిల్లాలో మొహమ్మద్ గౌస్ పల్లి నుండి మొదలుపెడితే ఏకే మల్లారం వరకు అభివృద్ధి పనులు ప్రారంభిస్తూనే ఉన్నామని, పిహెచ్సిసబ్ సెంటర్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని, ఈ గ్రామాలలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రభావితం ఉన్నందున వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని వారికి సంబంధించిన మందులను ఎక్కువ శాతం అందుబాటులో ప్రైమరీ హాస్పటల్లో ఉంచుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు.
గత వర్షాకాలంలో భారీ వర్షాల వలన ఈ గ్రామం చుట్టూ రహదారులు రాకపోకలు నిలిచిపోవడం పడవల సహాయంతో నిత్యవసర సరుకులను స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించామని, ఇండ్లు లేనివారికి మొదటి విడతలో కొన్ని ఇండ్లను మంజూరు చేశాం రెండవ విడుతలో అర్హులను గుర్తించి ఇండ్లను అందిస్తామని అన్నారు. పి హెచ్ సి లో సబ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం అని, గ్రామంలో ప్రభుత్వ నిధులు ఎక్కువ శాతంలో అందిస్తామని తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా రాష్ట్రంలో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి సారాధ్యంలో రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి పేదవాడికి సన్నబియ్యం రేషన్ షాపుల ద్వారా అందిస్తున్నామని, విద్యార్థినీ విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు పెంచామని, మన అక్కాచెల్లెళ్లకు ఉచిత బస్సు సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇందిరమ్మ ఇండ్లు విడతల వారీగా అందిస్తామని, జిల్లా యంత్రాంగం కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రభుత్వ అమలు చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను అందించడంలో కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా అందిస్తామని, ఏ ఒక్కరు కూడా నిరుత్సాహపడ కూడదని ఇప్పటివరకు మొదటి విడత ఇండ్ల మంజూరు జరిగిందని, రెండో విడతలో మిగిలిన నిరుపేదలకు మంజూరు చేయబడతాయని అన్నారు.గతంలో వాజేడు వెంకటాపురం మండలాలలో మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి రైతులు నష్టపోయారని, రైతులు ఈసారి ఎవరి దగ్గర విత్తనాలు కొనుగోలు చేస్తే వారి నుండి రసీదు తీసుకోవాలని,విత్తనాలను ఎవరైనా రసీదు లేకుండా విక్రయించినట్లయితే వారి వివరాలు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారికీ తెలుపాలని సూచించారు.అంతకుముందు మంత్రి సీతక్క, మంగపేట మండలంలో చుంచుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మల్లూరు గ్రామంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి, వైద్య పరీక్షలకు వచ్చిన రోగుల తో వైద్య సేవల పై ఆరా తీశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే మలేరియా డెంగ్యూ వ్యాధులను నియంత్రించుటలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను సూచించారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రులలో నే వైద్య సేవలను పొందాలని, గ్రామాలలో నిర్వహించే ఉచిత వైద్య సేవలను వినియోగించి కోవాలని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారికి బీపి,షుగర్ మరియు రక్త పరీక్షలను నిర్వహించి వైద్య సేవలను అందించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో వైద్య సేవలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుని, ఆరోగ్య కార్యకర్తలు మరియు ఆశా కార్యకర్తలు గ్రామాలలో నిరంతరంగా ఫీవర్ సర్వే, లార్వా డి వాటరింగ్ కార్యక్రమాలు నిర్వహించి, గర్భిణీ స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు జ్వరాలు వస్తే ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి తక్షణమే చికిత్సను అందించాలని అన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 120 మందికి వైద్య సేవలు అందించామని అలాగే 15 జ్వరము కేసులు, బిపి 35 షుగర్ 22, 15 మందికి రక్తపూతల పరీక్షలు నిర్వహించామని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ యమున తెలిపారు.