31-12-2025 12:54:08 AM
సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి
సుల్తానాబాద్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): ఎరువుల అమ్మకందారులు విధిగా ఎరువుల దుకాణం వద్ద స్టాక్ బోర్డు, ధరల పట్టికను ఏర్పాటు చేయాలని సుల్తానాబాద్ మండల వ్యవసాయ అధికారి పైడితల్లి అ న్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కట్నపల్లి రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి పైడితల్లి ఆధ్వర్యంలో సుల్తానాబాద్ మండలంలోని ఫెర్టిలై జర్ డీలర్స్ , సొసైటీ సీఈవో లతో సమావే శం నిర్వహించారు.
ఈ సందర్భంగా పైడితల్లి మాట్లాడుతూ ప్రస్తుతం సుల్తానాబాద్ మం డలoలో యూరియా నిల్వలు సరిపడ ఉన్నాయని, కావున రైతులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా యూరియా పంపిణీ చెయ్యాలి అన్నారు, ఫెర్టిలైజర్ బుకింగ్ అప్ లో యూ రియా బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈపీఓస్ లో ఎంటర్ చేసి యూరియా అ మ్మాలని, అమ్మిన తర్వాత స్టాక్ రిజిస్టర్లో ఎంట్రీ చేయాలి, రసీదు ఇవ్వాలి అన్నారు,ఈ కార్యక్రమంలో ఏఈఓలు, ఫెర్టిలైజర్ డీలర్స్, సింగిల్ విండోలా సీఈవోలు పాల్గొన్నారు.