20-06-2025 10:20:20 PM
హుస్నాబాద్: "డ్రగ్స్ను నిర్మూలిద్దాం, యువతరాన్ని కాపాడుకుందాం" అనే నినాదంతో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కన్వీనర్ కవ్వ లక్ష్మారెడ్డి(Constituency JAC Convener Kavva Lakshma Reddy) ఆధ్వర్యంలో హుస్నాబాద్ మండలంలో చేపట్టిన పోరుయాత్ర మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారం మీర్జాపూర్, వంగ రామయ్యపల్లి, బల నాయక్ తండ, మాలపల్లి, తోటపల్లి గాంధీనగర్ గ్రామాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... గత ఏప్రిల్ 21న ప్రారంభమైన ఈ యాత్ర నేటికి 59వ రోజుకు చేరిందని తెలిపారు. డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ వల్ల యువత ఎదుర్కొంటున్న అనర్థాలను, సమాజంపై వాటి దుష్ప్రభావాలను వివరించారు.
ముఖ్యంగా 12 నుండి 25 సంవత్సరాల లోపు విద్యార్థులు, యువకులు గంజాయి, కొకైన్, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్కు బానిసలై చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, బెట్టింగ్స్, లోన్ యాప్స్లో చిక్కుకొని ఆర్థిక భారాన్ని మోయలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. యువత భవిష్యత్తు నాశనం కాకుండా కాపాడుకోవాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులపై ఉందని లక్ష్మారెడ్డి గుర్తుచేశారు. ఈ అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్లు మేకల వీరన్న, డ్యాగల సారయ్య, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాశ్, ఏపీఎం అంబాల భిక్షపతి, లోడీ ప్రతినిధులు పాల్గొన్నారు.