24-06-2025 12:50:27 AM
కీవ్, జూన్ 23: రష్యా ఉక్రెయిన్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సోమవారం కీవ్ నగరంపై 350కి పైగా డ్రోన్లు, 11 క్షిపణులతో మాస్కో విరుచుకుపడింది. ఈ దాడిలో 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. నివాస భవనాలు, ఆసుపత్రులు, వాహనాలు ధ్వంసం అయినట్టు ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పశ్చిమదేశాలను కోరారు. ప్రజలు నివాసం ఉండే భవనాలే టార్గెట్గా రష్యా దాడులు చేస్తోందన్నారు. అమెరికా మౌనం వల్ల ఉక్రెయిన్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. కీవ్పై చేసిన దాడిలో రష్యన్ దళాలు ఉత్తర కొరియాకు చెందిన ఆయుధాలను ప్రయోగించినట్టు పేర్కొన్నారు.