15 June, 2026 | 2:05 PM

Breaking News

తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •  

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఏసీబీ రైడ్స్

19-11-2025 02:15 PM

హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోని ఫైళ్లు, రికార్డులు, డిజిటల్ డేటాను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారని ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లినట్లు అధికారులు వెల్లడించారు. భవన నిర్మాణాల్లో భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని కొంతకాలంగా టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి.  నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు వరసగా సోదాలు చేపడుతున్నారు. దీంతో అవినీతి అధికారుల్లో కలవరం మొదలైంది. గతంలో ఆర్టీఏ కార్యాలయంలో, ఈనెల 14న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, 18న విద్యాశాఖ ఆఫీసులో అధికారులు తనిఖీ చేశారు. కార్పొరేషన్ పరిధిలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో లంచాలకు పాల్పడుతున్న అధికారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.