14-07-2025 11:04:41 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహక పథకం(Economic Rehabilitation Scheme) క్రింద జిల్లాలో గల దివ్యాంగులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడం కొరకు ఋణాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గాను 100% రాయితీతో 50,000/- వేల చొప్పున 27 యూనిట్లు, 80% రాయితీతో లక్ష రూపాయల(01) యూనిట్, 60% రాయితీతో మూడు లక్ష రూపాయల(01) యూనిట్ మంజూరు చేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనెనా తెలిపారు. అర్హులైన దివ్యాంగులు tgobmms.cgg.gov.in వెబ్ సైట్ నందు ఈ నెల 14 నుండి 31 లోపు ఆన్లైలో దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 6301981960, 8331006010 నంబర్లను సంప్రదించాలన్నారు.