30 April, 2026 | 12:22 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ప్రమాదవశాత్తు చెరువులో పడి కార్మికుని మృతి

07-11-2024 01:29 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ ఎర్ర చెరువులో ప్రమాదవశాత్తు పడి 24 డిప్ ఏరియా కు చెందిన పులి రాజ్ కుమార్ (54) అని సింగరేణి కార్మికుడు మృతి చెందినట్లు తాళ్ల గురజాల ఎస్సై సిహెచ్.రమేష్ తెలిపారు. మృతుని భార్య పులి లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం తన స్నేహితుని సోదరుని కర్మకాండలకు వెళుతున్నానని చెప్పి తిరిగి రాలేదన్నారు. చెరువులో గుర్తుతెలియని శవం కనిపించినట్లు వాట్సాప్ గ్రూపులో చూసి నిర్ధారించినట్లు తెలిపారు. చెరువులో స్నానం చేసే సమయంలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు మృతుని భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ చెప్పారు.