మీ పిల్లల భవిష్యత్తుకు భరోసా మాది
13-06-2026 03:21 PM
పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం
నేరేడుచర్ల,(విజయక్రాంతి): పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు నేతృత్వంలో ఆచార్య జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారంలో నేరేడుచర్ల మున్సిపల్ కౌన్సిలర్లు ఇంజమూరి శ్రీకాంత్, యారవ లక్ష్మి పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ... నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని, సద్వినియోగం చేసుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సైదులు రషీద్ ఖాన్ ఎం నాగమణి లాల్ సాహెబ్ పి శ్రీను స్థానికులు గజ్జల కోటేశ్వరరావు,మహేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.






