30 March, 2026 | 12:10 PM

Breaking News

మోకిలాలో డ్రగ్ రాకెట్ భగ్నం— నిందితుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్   •   నటుడు ప్రకాశ్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన తల్లి కన్నుమూత   •   శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల సస్పెన్షన్   •   అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం.. సురక్షితంగా బయటపడిన 16 కుటుంబాలు   •   మాజీ ఎమ్మెల్యే మర్రి అభిమానులపై కేసు నమోదు   •   మైనింగ్‌పై దద్దరిల్లిన శాసనసభ బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్   •   మీ తాతలు దిగొచ్చినా పొంగులేటి రాజీనామా చేయరు   •   కన్నోళ్లకు భరోసా   •   ఆంధ్రోళ్ల చేతికి ఆర్టీసీ!   •   పశ్చిమాసియాలో భూతల యుద్ధం దగ్గరపడింది: అమెరికా 7,000 సైనికులు మోహరింపు, ఇరాన్ 10 లక్షల సైన్యం సిద్ధం   •  

అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలి

26-07-2024 04:38 PM

మంథని: మంథని మున్సిపల్ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్ లపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం తహశీల్దార్, మున్సిపల్ కమిషనర్ లకు  జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం  కార్యదర్శి బూడిద గణేష్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బూడిద గణేష్ మాట్లాడుతూ.. మంథనిలో శ్రీరామ వాటర్ ప్లాంట్, మధురం వాటర్ ప్లాంట్ తోపాటు 8 వాటర్ ప్లాంట్ లు ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రజల  ఆరోగ్యాలను దెబ్బతీసే విధంగా కెమికల్ వాడుతున్నారని, పరిశుభ్రత పాటించకుండా వాటర్ క్యాన్లను శుభ్రం చేయకుండా పాకురు పట్టిన క్యాన్లతో నీటిని సరఫరా చేస్తున్నన్నారు. మంథనిలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల వెలుస్తున్నాయి. వాటర్ ప్లాంట్లను సీజ్ చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని బూడిద గణేష్ అధికారులను కోరారు.