లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే చర్యలు
చేవెళ్ల ట్రాఫిక్ సీఐ సతీష్
శంకర్పల్లి, మార్చి 30 (విజయక్రాంతి): లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని చేవెళ్ల ట్రాఫిక్ సిఐ సతీష్ అన్నారు. సోమవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధి బీడీఎల్ ప్రధాన కూడలిలో పోలీసు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఓవర్ లోడ్ తో వాహనాలు రోడ్డుపై వెళ్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ప్రమాదం జరుగుతుందని తెలియజేశారు. కాగా వాహనాలకు తప్పని సరిగా నెంబర్ ప్లేట్లు ఉండాలని హెచ్చరించారు. పట్టణ కేంద్రంలోని రోడ్ల పై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుప రాదని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సురేష్ , సిబ్బంది ఉన్నారు.




