31 March, 2026 | 2:38 AM

ఒకే వాహనం.. ఆరుగురు మైనర్లు..!

31-03-2026 12:17 AM

ప్రమాదకర స్థాయిలో డ్రైవింగ్

ఆర్టీవో కార్యాలయం ముందు చెక్కర్లు

నాగర్ కర్నూల్ మార్చి 30 ( విజయక్రాంతి): ఓకే ద్విచక్ర వాహనంపై ఆరుగురు మైనర్లు అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రయాణం చేస్తూ వాహనదారుల కంటపడ్డారు. ఈ ఘటన సోమవారం నాగర్ జిల్లా గగ్గలపల్లి, తాడూరు గ్రామ శివారు ప్రాంతంలో రోడ్డు రవాణా శాఖ కార్యాలయం ముందు కనిపించింది.

అటుగా వెళుతున్న వాహనదారులు ప్రమాదక రంగా ప్రయాణిస్తున్న మైనర్ డ్రైవింగ్ చూసి క్లిక్ మన్పించారు. జిల్లా రోడ్డు రవాణా, ఆర్టీసీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నా ఇలాంటి ప్రమాదకర స్థాయి ప్రయాణం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నిత్యం వందలాది వాహనాలు అత్యంత వేగంగా వచ్చి వెళ్తున్న జాతీయ రహదారిపై ఇలా ఈ స్థాయిలో మైనర్లు ప్రయాణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.