నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే చర్యలు
21-06-2024 01:15 AM
సింగరేణి డైరెక్టర్ శ్రీనివాస్
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 20 (విజయక్రాంతి): క్వార్టర్స్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎన్వీకే శ్రీనివాస్ హెచ్చరించారు. గురువారం ఆయన కొత్తగూడెం పట్టణపరిధిలోని రైటర్ బస్తీ, బర్మా కా్ంయప్ ప్రాంతా ల్లో నిర్మాణ దశలో ఉన్న క్వార్టర్లను పరిశీలిం చి సంబంధించిన అధికారులకు సూచనలు సలహాలిచ్చారు. శిథిలావస్థలో ఉన్న క్వార్టర్లను తొలగించి, వాటిస్థానంలో అధునాత నంగా 195 క్వార్టర్లు నిర్మిస్తున్నామన్నారు.






