డీఎస్సీకి 2.78 లక్షల దరఖాస్తులు
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): డీఎస్సీ దరఖాస్తు గడువు గురువారం రాత్రి 11.50 గంటలతో ముగిసింది. గురువారం 8.30 గంటల వరకు 2,78,834 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫీజు చెల్లించిన వారు 2,84,997 మంది కాగా, అప్లికేషన్లు ఎడిట్ చేసుకున్నవారు 73,413 మంది ఉన్నారు. దరఖాస్తు గడువును పెంచే యోచనలో అధికారులు లేరు. కానీ, అభ్యర్థులు మరో రెండు రోజు లు పొడిగించాలని కోరుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో త్వరలోనే డీఎస్సీ పరీక్షల పూర్తి షెడ్యూల్ను ప్రకటించే వీలుంది. ఇదిలా ఉంటే డీఎస్సీ పరీక్షలను కొన్ని రోజులు వాయిదా వేయాలనే డిమాండ్ అభ్యర్థుల నుంచి వినిపిస్తోంది. ముందస్తుగా ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.






