13 June, 2026 | 9:24 PM

Breaking News

తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •   వేశ్య కాంతల చెరువు.. తామరచెరువు బేతుపల్లి చెరువులను సర్వే చేయాలి   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   గిరిజన సమాఖ్య జిల్లా ప్రధానకార్యదర్శిగా లింగానాయక్   •   బత్తాయికి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనపై ప్రత్యేక చొరవ   •   ఇంగ్లీష్ వృత్తి నైపుణ్యతపై ఉపాధ్యాయులకు శిక్షణ   •  

భారీగా క్రియాశీల సభ్యత్వం పెరగాలి

13-06-2026 08:08 PM

- మాజీ ఎమ్మెల్సీ నారదాసు

- బీఆర్ఎస్ సభ్యత్వ సమ్మేళన సమావేశం

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ కు నూతన జవసత్వం క్రియాశీల సభ్యత్వంతోనే వస్తుందని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు అన్నారు. బెల్లంపల్లి బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం బెల్లంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల సమ్మేళనం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి టీ బీ జీ కే ఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజి రెడ్డి, మాజీ మంచిర్యాల వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నారదాసు లక్ష్మణ్ రావు మాట్లాడుతూ పార్టీ సభ్యత నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని తెలిపారు. డిజిటల్ నమోదు వల్ల సభ్యుడు పూర్తి వివరాలు సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ యాప్ లో జిల్లా నియోజకవర్గ మండల గ్రామస్థాయిలు వారిగా వివరాలతో పాటు సభ్యుల బ్లడ్ గ్రూప్ పూర్తి చిరునామా కూడా నమోదు చేశాం అని వివరించారు.

గతంలో పుస్తకాల రూపంలో నమోదులో తప్పుడు నివేదికలు జరిగాయని, కనుక అదినేత కేసీఆర్  ఉద్యమకారులు, క్రియశిల నాయకులను ఒక తాటి మీదికి వచ్చి భారీ ఎత్తులో క్రియాశీలన నాయకులు నమోదు చెయ్యాలని,పిలుపునిచ్చారని తెలిపారు. క్రియాశీల సభ్యులకు ఇన్సూరెన్స్ వర్తిస్తుందిన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచులు మాజీ జెడ్పిటిసిలు ఎంపీటీసీలు , సింగిల్ విండో చైర్మన్ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్స్ ప్రతి గ్రామ వార్డు సభ్యులు పాల్గొన్నారు.