02-06-2025 12:16:43 AM
తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ
ఖైరతాబాద్; జూన్ 1 (విజయ క్రాంతి): తెలంగాణ ఉద్యమకారుల కోటాలో అద్దంకి దయాకర్ కు, మాదిగ సామాజిక వర్గం నుండి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం లకిడికపూల్లోనే ఓ హోటల్లో రౌండ్ టేబుల్ స మావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గజ్జెల కాంతం గారు మాట్లడుతూ... తెలంగా ణ రాష్ట్రంలో 70 శాతం ఉన్న మాదిగలకు రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మాదిగ సా మాజిక వర్గానికి చెందిన విద్యావంతులు డా క్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కు అవకాసం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే మాల సామాజిక వర్గానికి చెందిన తెలంగా ణ ఉద్యమ కారులు అయినటువంటి అద్దం కి దయాకర్ కు మంత్రివర్గంలో చోటు క ల్పించి తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాం గ్రెస్ పార్టీ హై కమాండ్కు విజ్ఞప్తి చేశారు.
అనంతరం డాక్టర్ పిడమర్తి రవి మాట్లడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలము ఇళ్లు కట్టుకొనుటకు 25 లక్షల రూపాయలు ను అందించాలని అన్నారు. ఆలాగే ఉద్యమ కారులకు 25 వేల రూపాయల పెన్షన్ ను ఇవ్వాలని, ఉద్యోగ నియామకాలలో ఉద్యమ కారులకు అవకాశం కల్పించాలని కోరారు.
కార్పోరేషన్ పదవులలో ఉద్యమ కారులైనా మాదిగలకు మొదటి ప్రాధాన్యత నివ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి వెంకటేశ్ గౌడ్, మీసాల మల్లేశం, బొంకూరి సురేందర్ సన్ని, డాక్టర్ సంజీవ్ నాయక్, కోల శ్రీనివాస్, గజ్జెల ఆనందరావ్, గజ్జెల మల్లికార్జున్, బోరెల్లి సురేష్, క్యాదాసి ప్రభాకర్, సముద్రాల అజయ్, సుద్దాల లక్ష్మణ్, దేవరకొండ నరేష్, బొమ్మెర స్టాలిన్, నిమ్మల వీరన్న మీసాల మహేష్, గోసికి శంకర్, నీరుకుల్ల అనిల్ తదితరులు పాల్గొన్నారు.