calender_icon.png 3 June, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజ హితానికి శాంతి చర్చలు చారిత్రకం

02-06-2025 12:18:32 AM

సదస్సులో ప్రొఫెసర్ హర గోపాల్

ముషీరాబాద్, జూన్ 1 (విజయక్రాంతి): ప్రభుత్వం కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలు జరపాలని  స్వయంగా కోరుకుంటున్న విప్లవ పార్టీలు, పౌర సమాజం లోని ప్రజా సంఘాలు, ప్రజా అభిప్రాయ మేరకు సమాజ మంచి భవిష్యత్తు కొరకు శాంతి చర్చలు చారిత్రక అవసరమని  ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.

ఆర్ ఎస్ యూ వ్యవస్థాపక సభ్యుడు, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు స్మృతిలో సాయుధ పోరాటం శాంతి- చర్చలు గుండె కోట అమరుల వేదిక సద స్సు హైదరాబాద్ బాగ్ లింగం పల్లి, సుం దర విజ్ఞాన కేంద్రంలో ఆదివారం పూర్వ విప్లవ విద్యార్థి నాయకులు సాంబమూర్తి  అధ్యక్షతన నిర్వహించారు.ఈ సదస్సుకు పలువురు వక్తలు, పూర్వ విప్లవ విద్యార్థులు హాజరై  మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్రొ ఫెసర్ హరగోపాల్, డాక్టర్ భుజంగారావు ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, ఎన్. రవి, ఎన్. వేణుగోపాల్, డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్ మాట్లా డుతూ విప్లవో ద్యమ అనిచివేత లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ కగార్ ఆదివాసుల సహనానికి కారణమవుతుందన్నారు.

కార్పొరే ట్ దోపిడీని వ్యతిరేకిస్తున్న ఆదివాసి సమాజానికి అండగా ఉన్న విప్లవ ఉద్యమ నిర్మూ లించడం ద్వారానే పెట్టుబడుదారుల ప్ర యోజనాలను కాపాడగలమన్న భావనతో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలపై యుద్ధం చేస్తుండడం,మధ్య భారతంలో జరుగుతున్న ఈ మారణ హోమానికి అర్థవంతమైన పరిష్కారం వెతకాలనే ఉద్దేశంతో హక్కుల సం ఘాలు ప్రజాసామిక వాదులు మావోయిస్టు లతో శాంతి చర్చలు జరపాలన్న ప్రతిపాదన ను ముందుకు తెచ్చాయ న్నారు.

దేశవ్యాప్తం గా ఈ విషయంపై చర్చ జరుగుతున్న శాంతి కోసం జరుగుతున్న ప్రయత్నాలను ఖాతర్ చేయని కేంద్ర ప్రభుత్వం యుద్ధ బీభత్సాన్ని సృష్టిస్తుంది అని విమర్శించారు. ఆదివాసుల హరణాన్ని నిరోధించడానికి, జల్ జం గల్, జమీన్ అస్తిత్వంపై ఆదివాసుల హక్కు నిలబడడానికి ప్రాథమికంగా మావోయిస్టు లు చర్చలకు సిద్ధమయ్యారని తెలిపారు. ఇకనైనా  శాంతి చర్చలు వెంటనే కేంద్రం శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.