15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఉరేసుకొని ఆదివాసి ప్రేమజంట ఆత్మహత్య

28-01-2026 12:11 PM

నల్లమల్లలు దారుణ సంఘటన 

అచ్చంపేట జనవరి 28: ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదన్న కారణంతో ఓ ఆదివాసి ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నల్లమలలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా బొమ్మనపల్లికి చెందిన చెంచు కుటుంబానికి చెందిన దాసరి ప్రసాద్, పదర మండలం చిట్లంకుంటకు చెందిన సువర్ణ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇద్దరి కుటుంబాలలోను తెలిసింది.

కాగా వీరు పెళ్లికి సువర్ణతలకు బంధువులు నిరాకరించారని తెలుస్తోంది. దీంతో మంగళవారం రాత్రి బొమ్మనపల్లి లోని ప్రసాద్ ఇంట్లో ప్రేమికుల ఇద్దరు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా సువర్ణ రెండు రోజుల క్రితమే తల్లిదండ్రులను వదిలేసి ప్రసాదింటికి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. కృతదేహాలను శవపరిక్ష నిమిత్తం అచ్చంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒక గాను ఒక కొడుకు అర్ధాంతరంగా తను చాలించడంతో ప్రసాద్ తల్లిదండ్రుల రోదనలు అందర్నీ కలచివేస్తున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు సిద్ధాపూర్ పోలీసులు తెలిపారు.