02-12-2025 01:32:06 AM
-ఇంజినీర్లు, విద్యార్థులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ
-విశ్వవిద్యాలయం ద్వారా రీస్కిల్, అప్ స్కిల్స్
-కోవాసెంట్ సంస్థ మరో రెండేళ్లలో 3 వేల మందికి ఉపాధి
-ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు
హైదరాబాద్, డిసెంబర్ 1 (విజయక్రాంతి) : ప్రపంచంలోని అత్యుత్తమ యూని వర్సిటీల సాంకేతిక సహకారంతో మరో రెండు నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు.
సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న ఇంజినీర్లు, చదువులు పూర్తి చేస్తున్న విద్యార్థులకు దీని ద్వారా నూతన నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. సో మవారం హైదరాబాద్లో కోవాసెంట్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడారు. ప్రస్తుతం 500 మంది ఇంజినీర్లు పనిచేస్తున్న కోవాసెంట్ మరో రెండేళ్లలో 3 వేల మంది ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు.
ఏఐ సాంకేతిక దూకుడుతో కోడింగ్లో ఉన్నవారు ఇతర ప్లాట్ ఫామ్ల్లో పనిచేస్తున్న వారు నైపుణ్యాలను పెంచుకోక తప్పుని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వారందరికీ ఏఐ యూనివర్సిటీ ద్వారా రీస్కిల్, అప్ స్కిల్స్ అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కోవాసెంట్ చైర్మన్ సీవీ సుబ్రమణ్యంను ప్రత్యేకంగా ప్రశంసించారు.
18 మంది ఉద్యోగులతో దశాబ్దాల క్రితం సిగ్నిటీ పేరుతో సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించిన ఆయన ప్రస్తు తం వేల మంది సిబ్బందితో ప్రపంచస్థాయి సంస్థగా కోవాసెంట్ను తీర్చి దిద్దారని తెలిపారు. టెక్నాలజీ అంటే సిలికాన్ వ్యాలీ, ప్ర పంచ ప్రొడక్షన్ సెంటర్గా చైనాలోని షెం జెన్, క్రమ శిక్షణ, సుపరిపాలన కలిగిన దేశంగా సింగపూర్ల గురించి చెబుతారని, ఈ మూడు లక్షణాలు కలగలిసిన నగరంగా హైదరాబాద్ రూపొందుతోందని తెలిపారు.
ఇక్కడ ఉన్న అనుకూల పర్యావరణం దేశం లో మరెక్కడా లేదని పేర్కొన్నారు. అత్యధిక సంఖ్యలో గ్లోబల్ సామర్థ్య కేంద్రాలున్న నగరంగా అగ్రస్థానంలో నిలిచిందని చెప్పారు. ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంచుకున్నాయని, ఇది అత్యంత గర్విం చదగ్గ అంశమని తెలిపారు.
లైఫ్ సైన్సెస్ రంగంలో గణనీయ ప్రగతిని సాధించామని, దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే తయారవుతున్నాయని వెల్లడించారు. హెల్త్కేర్ ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటవుతున్నాయని, ఇటువంటి ఎకో సిస్టం మరెక్కడా కనిపించదన్నారు.
తమ ప్రభుత్వ దృఢ సంకల్పం వల్ల ఇవన్నీ సాధ్యమయ్యాయని తెలిపారు. సమావేశంలో కోవాసెంట్ చైర్మన్ సుబ్రమణ్యం, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సంజయ్ కుమార్, ఐటీ సలహాదారు సాయికృష్ణ, యూకే డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ వయన్ ఓవేన్ పాల్గొన్నారు.